ప్రముఖ హాస్య నటుడు కేజీఎఫ్ 2 ఫేమ్ మోహన్ జునేజా కన్నుమూశారు. మోహన్ జునేజా గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంతో చిక్కబాణవర సప్తగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కన్నడలో జోగి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోహన్ జునేజా కన్నడలో వందకుపైగా సినిమాలో నటించారు. ఈ మధ్యే విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 మోహన్ జునేజా ప్రధాన పాత్రలో నటించారు. జునేజా చెలట్టా చిత్రంలో మధుమగా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలోని పలు చిత్రాల్లో హాస్యనటుడుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మోహన్ జునేజా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చిక్కబాణవరంలోని సప్తగిరి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మోహన్కు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు
Post a Comment
0Comments
3/related/default