చిదంబరం ఇళ్లు, ఆఫీస్‌లపై సీబీఐ దాడులు

Telugu Lo Computer
0


చిదంబరం నివాసాలు, ఆఫీస్‌లపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో ఏడు చోట్ల సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం నివాసాలపైనా సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తి చిదంబరం ఉన్న కేసులకు సంబంధించి తండ్రికొడుకుల నివాసాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీపై సీబీఐ కేసులు నమోదయ్యాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)