రాజస్తాన్లోని జోధ్పూర్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి జాలోరి గేట్ ప్రాంతంలో జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగి ఇరు మతాల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా.. ఇంటర్నెట్ సర్వీసును నిలిపివేశారు. ఈద్ సందర్భంగా నమాజ్ కూడా పోలీసుల పర్యవేక్షణలో జరిగింది. జోధ్పూర్లో మూడు రోజుల పాటు పరుశురామ్ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాగా, జెండాలను ఏర్పాటు చేయడంలో ఇరు వర్గాల మధ్య వివాదం కాస్తా.. రాళ్లు రువ్వుకునేంత వరకు చేరింది. వీరిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్తో పాటు భాష్పవాయు ప్రయోగించారు. మంగళవారం తెల్లవారు జామున వరకు జరిగిన రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి, భద్రతలకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
Post Top Ad
adg
Tuesday, 3 May 2022
Home
National
ఇంటర్నెట్ నిషేధం
జెండాలు ఎగురవేయడంపై వివాదం
జోధ్పూర్లో మత ఘర్షణలు
రాజస్తాన్
జోధ్పూర్లో మత ఘర్షణలు
జోధ్పూర్లో మత ఘర్షణలు
Tags
# National
# ఇంటర్నెట్ నిషేధం
# జెండాలు ఎగురవేయడంపై వివాదం
# జోధ్పూర్లో మత ఘర్షణలు
# రాజస్తాన్
About Telugu Post
రాజస్తాన్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment