తమిళనాడు లోని కోయంబేడు మార్కెట్లో కిలో టమోటా రూ.110కి చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కోయంబేడు మార్కెట్కు పలు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు 600 లారీల్లో సుమారు 6 వేల టన్నుల టమోటాలు దిగుమతి అవుతుంటాయి. వారం రోజులుగా వర్షాల కారణంగా మార్కెట్కు 400 లారీల్లో 4,500 టన్నుల టమోటాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో, టమోటా ధరలు రోజు పెరుగుతూ ఆదివారం రూ.110కి చేరుకుంది. అదే సమయంలో చిల్లర దుకాణాల్లో కిలో రూ.120కి విక్రయమవుతోంది.
Post a Comment
0Comments
3/related/default