కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో సవరణలు

Telugu Lo Computer
0


కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్​లో మూడు కీలక సవరణలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం తిరిగి వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. గత జులై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్ లు గెజిట్ జారీ చేసిన రోజు నుంచి ఆరు నెలల్లోపు సమర్పించి అన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. అలాగే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అన్ని అనుమతులు తీసుకోవాలి.. ఒకవేళ తీసుకోలేకపోతే ఆయా ప్రాజెక్టులను నిర్వహించొద్దని గెజిట్ లోని నిబంధనల్లో చేర్చారు. అయితే ఆరు నెలల్లోనే ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడంలో ప్రాక్టికల్ గా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గెజిట్ లో సవరణలు చేసినట్టుగా కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు పర్మిషన్ తీసుకునే గడువును పొడిగించారు. రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ లు ఈ ఏడాది జులై 14 లోపు సీడబ్ల్యూసీకి సమర్పించి, వాటికి పర్మిషన్ తీసుకునేందుకు అవకాశం కల్పించారు. రెండు రాష్ట్రాలు సీడ్ మనీ ఇచ్చే గడువును 60 రోజుల నుంచి ఏడాదికి పొడిగించారు. దీంతో ఈ ఏడాది జులై 14 వరకు సీడ్ మనీ ఆయా బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)