వైద్య విధాన్‌ పరిషత్‌ వైద్యుల జీతాలు పెంపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైద్య విధాన్‌ పరిషత్‌లో విధులు నిర్వహించే వైద్యుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పె షలిస్ట్)లకు రూ. 53,500 వేతనం ఉండగా, ఆ మొత్తాన్ని 85,000 చేస్తున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా దీనిని అమలు చేస్తున్నారు. పెంచిన జీతాలను ఏప్రిల్‌ నుంచి అమలులోకి రా నున్నాయి. దీంతో పాటు కొత్తగా విధుల్లోకి వచ్చిన వైద్యుల ప్రొబేషన్‌ కాలాన్ని రెండేళ్లకు తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)