ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Telugu Lo Computer
0


బీహార్‌లోని పుర్నియ జిల్లా చకర్పద గ్రామంలో కుమార్‌, సావిత్రి దేవి లకు పదేండ్ల కిందట వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్ భార్య సావిత్రి దేవి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఈ క్రమంలో కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో భార్య సావిత్రి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. దీంతో తమ బండారం బయటపడటంతో సావిత్రి ప్రియుడు మహల్దార్‌తో కలిసి కుమార్ మెడకు తాడు బిగించి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కుమార్‌, సావిత్రిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)