కలెక్టర్లుగా నియమితులైన భార్యాభర్తలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన శనాపతి ఢిల్లీరావు, ప్రశాంతి భార్యాభర్తలు. వీరిద్దరూ పట్టుదలతో చదివి 2006 లో గ్రూప్-1 రాసి ఎంపికయ్యారు. 2008లో పార్వతీపురం ఆర్డీవోగా ప్రశాంతి, విజయనగరం ఆర్డీవోగా ఢిల్లీరావు విధుల్లో చేరారు. అయితే, జిల్లాల పునర్విభజనలో భాగంగా వీరిద్దరూ కలెక్టర్లుగా నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రశాంతి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఢిల్లీరావు నియమితులై య్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)