ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌గంజ్‌, బంగ్లా చౌక్‌లో  ఒకే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, అతని భార్య, కుమార్తెను దుండగులు పదునైన ఆయుధాలతో గొంతుకోసి ఇంటికి కొద్ది దూరంలోనే అత్యంత పాశవికంగా హత్య చేశారు. మృతులను గమ నిషద్ (42), అతని భార్య సంజు నిషద్ (38), కుమార్తె ప్రీతి (20)గా గుర్తించారు. ఈ కేసులో అలోక్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం కావడంతో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ''నిందితుని ఇంటరాగేట్ చేస్తున్నాం. ప్రీతిని అలోక్ ప్రేమిస్తున్నాడని తెలిసింది. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు బయటకు వస్తాయని, ఈ హత్యల్లో నిందితులు ఒక పారను ఆయుధంగా ఉపయోగించారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)