విశాఖలోని గాజువాక కొత్తకర్నవానిపాలెంలో టైలరింగ్ పని చేసుకునే పి.లక్ష్మీనారాయణ, దుర్గ దంపతులు స్థానికంగా ఉంటున్నారు. వీరి కుమార్తె శ్రావణి (22) గాజువాక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటోంది. ఉదయాన్నే తల్లిదండ్రులతో పాటు, సోదరుడు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత.. ఒంటరిగా ఉన్న శ్రావణి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటికి తిరిగొచ్చిన తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో శ్రావణిని కిందకు దింపి కేజీహెచ్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అనారోగ్య కారణంగా తన కుమార్తె ఇలా చేసిందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖలో యువతి ఆత్మహత్య
April 03, 2022
0