రేపు ఢిల్లీకి వెళ్లనున్న జగన్మోహనరెడ్డి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 April 2022

రేపు ఢిల్లీకి వెళ్లనున్న జగన్మోహనరెడ్డి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. 30న జరగనున్న జ్యుడిషీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. జగన్ ఢిల్లీ పర్యటనలో మరోసారి ప్రధాని మోదీని కలవనున్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలు చర్చిస్తారన్న విషయం ఆసక్తి రేపుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక అంశాలను ఆయన చర్చిస్తారని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గేర్ మారుస్తున్నాం, సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలకు జగన్ సూచించిన నేపథ్యంలో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని విషయంలో ప్రధానంగా ప్రధాని మోదీతో జగన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments:

Post a Comment