తుమ్మపూడిలో వివాహితపై హత్యాచారం

Telugu Lo Computer
0


ఆంధ్రరాదేశ్ లోని విజయవాడ అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఓ మహిళపై హత్యాచారం జరగడం కలకలం రేపింది. వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం.. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. తిరుపతమ్మకు 15ఏళ్ల క్రితం శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం వెళ్తూ ఐదారు నెలల వరకూ రాడు. ప్రస్తుత ఘటన విషయం ఆయనకు తెలియజేయడంతో తిరుపతిలో ఎలక్ట్రిక్ పనుల నిమిత్తం ఉన్నట్టు తెలిసింది. ఘటనపై అనుమానాలు ఉన్నట్టు తెలిపారు. మృతురాలి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయని, చెవి రింగులు పడి ఉన్నాయని, గొంతుపై గట్టిగా నులిమినట్టు గుర్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)