రాజస్థాన్ ప్రభుత్వం పశువుల యజమానుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమేరకు కఠిన నిబంధనలు తెచ్చింది. పట్టణాలు, నగరాల్లో పశువులను పోషించే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ పొందాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ మునిసిపల్ కార్పొరేషన్లు మరియు కౌన్సిల్ల పరిధిలోని ఇళ్లలో ఆవులు గేదెలను పెంచుకునే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ తీసుకోవాలి. ఆయా పశువుల పెంపకం కోసం కనీసం 100 చదరపు గజాల స్థలం కేటాయించేలా తప్పనిసరి చేసింది.