దేశంలో ఒక్కరోజే 90 శాతం పెరిగిన కరోనా కేసులు !

Telugu Lo Computer
0



దేశంలో నిన్నటి వరకు వెయ్యిలోపే పాజిటివ్ కేసుల నమోదు కాగా  తాజాగా సోమవారం 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  కేంద్రం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. వెయ్యి లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆదివారం 2.6లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 2,183 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందురోజు శనివారం 1,150 గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కరోజులోనే 90శాతం మేర పెరగడం కలకలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో 214 మంది కొవిడ్ భారిన మృతిచెందారు. క్రియాశీలక కేసులు 11,542 కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో రికవరీ వాటా 98.76 శాతంగా ఉండగా, క్రియాశీల కేసులు 0.03 ఉన్నాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం చూస్తే.. భారత్ లో 2,183 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో కేరళ రాష్ట్రంలో 940, ఢిల్లీలో 517 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణించిన వారి వివరాలను చూస్తే.. 241 మంది మృతి చెందగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే 213 మంది మృతి చెందారు. ఢిల్లీలో భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతుంది. ఇదిలాఉంటే పిల్లల్లో కొవిడ్ లక్షణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదైతే వెంటనే పాఠశాలలను మూసివేయాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కేరళ ప్రభుత్వంసైతం కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దృష్టి కేంద్రీకరించింది. కొవిడ్ వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకుంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)