పోలీసు క్యాంపు పై మావోయిస్టుల దాడి

Telugu Lo Computer
0


ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా దర్భా వద్ద పోలీసు క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లలు తీవ్రంగా గాయాపడ్డారు. అందులో ఇద్దరి జవాన్ల పరిస్థితి విషయంగా ఉండడంతో రాయపూర్ దవాఖాకు తరలించారు. బస్తర్ ఐజిపి సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దర్బా సమీపంలోని జైగుర్ పోలీసు క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడరాని తెలపారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డగా.. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని వారిని హెలీకాప్టర్ లో రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించామన్నారు. మిగిలిన ఇద్దరికి బీజాపూర్ జిల్లా దవాఖానలో చికిత్స అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఘటనాస్థలానికి అదనపు బాలగాలను రప్పించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)