ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గూబగుడం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టును జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతులు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి, గాయపడిన వారి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. అతి వేగమే ఈ ప్రమాదం కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
April 18, 2022
0
Tags