ఏడాదికి రూ.720 కోట్లు విరాళాలు అందుకున్న బీజేపీ!

Telugu Lo Computer
0


2019-20 సంవత్సరానికి గానూ జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల గురించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వివరాలను వెల్లడించింది. భారతీయ జనతా పార్టీ అత్యధిక విరాళాలను అందుకుంది. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలను లెక్కించి ఏడీఆర్ ప్రకటించింది. బీజేపీ ఏకంగా రూ.720 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని పేర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. దానికి రూ.133 కోట్ల రూపాయలు మాత్రమే విరాళాలు వచ్చాయని ఏడీఆర్ ప్రకటించగా ఆ తరువాత ఎన్సీపీ రూ.57 కోట్ల విరాళాలు అందుకుంది. కాగా అత్యధిక విరాళాలు ఇచ్చిన కంపెనీగా ఫ్రడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిలిచింది. ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్ కు కలిపి రూ.247 కోట్లు విరాళాలు అందించింది. గతంలో 2016-17కు గానూ బీజేపీ రూ.532 కోట్లు దక్కించుకోగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు 2019-20 ఏడాదిలో స్వల్పంగా తగ్గి రూ.720 కోట్ల విరాళాలు అందాయి. మొత్తంగా చూస్తే ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీల వరకు ఈ విరాళాలు భారీగానే అందుతున్నట్లు కనిపిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)