నవ వధూవరుల పాలిట యమ పాశం ?

Telugu Lo Computer
0


కేరళ లోని కోజికోడ్‌ ప్రాంతానికి చెందిన రజిన్, కనిహా ఈ ఏడాది మార్చి 14న అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. పెళ్లి తాలూకూ మధురానుభూతులు ఇంకా చెరిగిపోలేదు. ఇంటికి కట్టిన తోరణాలు పూర్తిగా ఎండనూ లేదు. ఆ ఇంటి నుంచి పెళ్లి కల అలా ఉండగానే.. తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ వాళ్ల పాలిట యమ పాశంగా మారింది. నవ వధూవరులు ఇద్దరూ జాంకిక్కడ్ ప్రాంతంలోని కుట్యాడి నది సమీపంలో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లారు. ఫొటోలు దిగుతుండగా ఇద్దరూ నదిలో పడిపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది .అప్పటి వరకు  సందడిగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. ఫోటోషూట్ జరిగిన ఈ కుట్యాడి నది ప్రాంతంలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెయిలింగ్ లేకపోవడం, నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు స్థానికులు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర నిశ్చితార్థాల కారణంగా ఈ జంట ఔట్‌డోర్ వెడ్డింగ్ షూట్‌ను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం 7 గంటలకు షూటింగ్‌ ప్రారంభమైంది. మృతుడు పేరంబ్రా సమీపంలోని కడియంగడ్‌కు చెందిన రెజిల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పెరువణ్ణాముజి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలోని కుట్టియాడి నది నీటి అడుగున లోతైన గుంతల గురించి తెలియని చాలా మంది పర్యాటకులకు గతంలో మరణ ఉచ్చుగా మారింది. ఈత రాని రెజిల్ ఆ గుంతలో చిక్కుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)