దేశంలో గడిచిన 24 గంటల్లో 5,05,065 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 2,927 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో వెల్లడైంది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,65,496కి చేరింది. నిన్న కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,23,654కి చేరింది. గత 24 గంటల్లో 2,252 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,25,563కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజువారి పాజిటివిటీ రేటు 0.58గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 21,97,082 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,19,40,971 డోసులను పంపిణీ చేశారు.
దేశంలో కొత్తగా 2,927 కరోనా కేసులు నమోదు !
April 27, 2022
0
Tags