విజయసాయి రెడ్డికి అదనపు బాధ్యతలు

Telugu Lo Computer
0


ఎంపీ విజయసాయి రెడ్డికి వైసీపీ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలు అప్పగించారు. రీజినల్‌ కో- ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే, మీడియా కో-ఆర్డినేషన్‌ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేటాయించారు. ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను మార్చుతూ సీఎం కొత్త ఆదేశాలు జారీ చేశారు. గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి బాధ్యతలు చూశారు. అయితే ఇటీవల కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు. విశాఖ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు

Post a Comment

0Comments

Post a Comment (0)