ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేట దేచవరం అడ్డరోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను.. ఎదురుగా వస్తున్న ప్రయాణికులతో వస్తున్న టాటాఏసీ వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆదినారయణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులంతా గుళ్లాపల్లి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
గుంటూరులో రోడ్డు ప్రమాదం
March 11, 2022
0