యాదాద్రి లక్ష్మీ నరసింహ్మా స్వామికి టీటీడీ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను శుక్రవారం సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు, టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణలతరెడ్డితో పాటు ఇతర అధికారులు యాదాద్రిలో ఆలయ ఈవోకు అందజేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై శ్రీ రామలంకార సేవలో ఊరేగారు. ఉదయం 11 గంటలకు గజ వాహనం సేవపై స్వామి వారి కల్యానోత్సవ వేడుక జరగనుంది. కల్యాణోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)