గోల్డ్ కాయిన్ మిస్టరీ...!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలో ఎక్కడ చూసినా బంగారు నాణాల చర్చే నడుస్తోంది. ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన రవితేజ మరో మహిళతో కలిసి ఊళ్లోంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో అతని పొలంలో గోల్డ్ కాయిన్స్ దొరికాయన్న ప్రచారం ఊపందుకుంది. ఆనోటా ఈనోటా బంగారు నాణేల ప్రచారం పోలీసుల చెవిన పడింది. దీంతో గ్రామస్తులందర్నీ విచారించారు. బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని టెస్ట్‌లకు పంపించారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ వ్యవహారంపై కూపీ లాగారు. గోల్డా, సిల్వరా అన్నది పక్కన పెడితే మరింత లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపేడు ఈశ్వరయ్య కాలనీ వాసులు మాత్రం బంగారు నాణేల ప్రచారాన్ని ఖండించారు. ఊళ్లోంచి పారిపోయిన రవితేజను తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఊళ్లో సంగతి ఎలా ఉన్నా.. నకిలీ నాణాలను వైరల్‌ చేయడం వెనుకున్న కథేంటో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడే ముఠా పనేనన్న కోణంలో ఆరాతీస్తున్నారు. ఇదే కాలనీకి చెందిన అంజీ అండ్ కో గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. అలాగే బంగారు నిధి దొరికిందన్న ప్రచారాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వేర్వేరు కోణాల్లో కూపీ లాగుతున్నారు. మరోవైపు రవితేజ దొరికితే మరిన్ని నిజాలు బయటికొస్తాయని భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)