ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పార్టీలో నెలకొన్న సంస్థాగత బలహీనతలను పరిష్కరించడంతో పాటు పార్టీ నిర్మాణంలో సమగ్ర మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాకు పూర్తి అధికారం ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఉందని పేర్కొన్న ప్రశాంత్ కిశోర్ బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోందని అన్నారు. కాంగ్రెస్కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు. దాని ఆత్మ, ఆలోచనలు, భావజాలం అలానే ఉంటాయి కానీ, మిగతావన్నీ కొత్తగా ఉండాలని అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ను విడిచిపెట్టినా ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదని, కాబట్టి కాంగ్రెస్ డ్రాయింగ్ బోర్డుకు తిరిగి వెళ్లి ప్రాథమికాలను సరిచేయాల్సిన సమయం ఇదేనని పీకే వ్యాఖ్యానించారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు షార్ట్కట్స్ ఏమీ లేదని, 10-15 ఏళ్ల దృక్కోణంతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గమని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
కాంగ్రెస్ కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉంది
March 16, 2022
2
అసలు కాంగ్రెసు పార్టీ అవసరం ఉందా అని !!
ReplyDeleteమన దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. మరో పెద్ద జాతీయ పార్టీ వచ్చే వరకూ కాంగ్రెస్ పార్టీ ఉండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే బిజెపి ఆడింది ఆట పాడింది పాట అయిపోతుంది.
ReplyDelete