పంజాబ్ లో ఆప్ నుంచి బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులూ ఏకగ్రీవమయ్యారు. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, సంజీవ్ అరోడా, అశోక్ మిత్తల్ను పంజాబ్ నుంచి ఆప్ తరపున రాజ్యసభ సభ్యులుగా ప్రకటించింది. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఎలాంటి ఓటింగ్ లేకుండానే ఈ ఐదుగురూ ఏకగ్రీవమయ్యారు. అధికారికంగా మార్చి 31 న ప్రకటిస్తారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లలో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.