పెండ్లి మండపంలో ఎగసిపడిన మంటలు

Telugu Lo Computer
0


ఢిల్లీలో గురువారం రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి మండపం పూర్తిగా కాలిపోయింది. మధ్యాహ్నం 1.48 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్‌ ఇంజన్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గంటకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. రోహిణి ప్రాంతంలోని సెక్టార్‌ 11 వద్ద ఉన్న సీఎన్‌జీ స్టేషన్‌ సమీపంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్మేశాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు గాలులు కూడా మంటలకు తోడయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. పెండ్లి వేడుక జరిగిన సమీపంలోనే సీఎన్‌జీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఉండటంతో స్థానికులు మరింత ఆందోళన చెందారు. పెండ్లి మండపం చెక్కతో తయారు చేయడం మంటల వ్యాప్తికి కారణంగా తెలుస్తున్నది. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలియరాలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అతడికి ప్రాథమిక చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)