యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘కెజిఎఫ్ చాఫ్టర్2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో కరణ్ మాట్లాడుతూ దక్షిణాది సినిమాలు, టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించాడు. ”సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఇకపై అన్ని పరిశ్రమలను కలిపి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని పిలవాలి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ చాలా నేర్చుకోవాలి. పాత కథలను, రొటీన్ సినిమాలని ఎంచుకోకుండా కొత్త దారిని సృష్టించుకోవడమే తెలుగు సినిమా విజయాలకు కారణం. కానీ బాలీవుడ్లో మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్ హిట్ అయితే అంతా ఆ తరహా చిత్రాలనే తీస్తున్నారు. సందేశాత్మక చిత్రాలు విజయం సాధిస్తే అవే తీస్తారు. నాతో సహా మిగిలిన దర్శక నిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగు సినిమా హాలీవుడ్లో, బాలీవుడ్లో ఏం చేస్తున్నారు అని ఆలోచించడం లేదు. తమ సొంత ఆలోచనలతో కొత్త తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్నాయి. అందుకే ఇవాళ 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు బాలీవుడ్లో కూడా గొప్ప విజయాలు సాధించాయి” అని తెలిపారు.
టాలీవుడ్పై కరణ్ జోహార్ ప్రశంసలు !
March 28, 2022
0
Tags