ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద సందడి!

Telugu Lo Computer
0


పంజాబ్‌లో ఆప్‌ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను చీపురుతో ఊడ్చేసింది. 117 సీట్లున్న పంజాబ్ లో ఏకంగా ఆప్ 90 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండిపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోలేదు. ఆ పార్టీ 17 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం రెండు స్థానాల్లో కొనసాగుతోంది. పార్టీ విజయం దిశగా ముందుకెళుతుండడంతో నేతలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ శుభాకాంక్షలు తెలియచేకుంటున్నారు.  ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు నడుమ డ్యాన్స్ లు వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)