డ్రైవర్‌ను పెళ్లి చేసుకున్న మంత్రి కూతురు

Telugu Lo Computer
0


తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు కుమార్తె జయ కళ్యాణి తమ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే సతీష్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని  ఆమె తన తండ్రికి తన ప్రేమ విషయం చెప్పింది. అందుకు తండ్రి ఒప్పుకోలేదు, పైగా సతీష్ దళితుడు, తన వద్ద డ్రైవర్ కూడా అవటంతో అంగీకరించలేదు. రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో సతీష్ ను నిర్భందించాడు కూడా. అప్పట్లో సతీష్, జయ కళ్యాణి మైనర్లు కావటంతో ఎవరూ స్పందించలేదు. పోలీసుల నిర్భంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత సతీష్ జరిగిన ఘటన గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మీడియాలో వైరల్ య్యింది. ఇప్పడు ఇద్దరూ మేజర్లు కావటంతో బెంగుళూరులోని ఒక సామాజిక కార్యకర్త సహాయంతో మార్చి 7వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి తనకు, తన భర్తకు తండ్రి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఇద్దరూ కలిసి బెంగుళూరు పోలీసు కమీషనర్ కమల్ పంత్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)