మహారాష్ట్ర లోని గణనాథుడి పట్ల రైతులు తమకున్న భక్తిని చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కిలోల ద్రాక్ష పండ్లతో అలంకరణ చేశారు. సంక్షతి చతుర్ధి నేపథ్యంలో ద్రాక్ష పండ్లతో ఆలయాన్ని అలంకరించామని అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ ద్రాక్ష పండ్లను ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, ఎన్జీవోల్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు ప్రసాదంగా అందించినట్లు సహ్యాద్రి ఫామ్స్ మెంబర్ మీడియాకు వెల్లడించారు.