అల్పాహారం తినకపోతే అనేక అనర్ధాలు

Telugu Lo Computer
0



ఉదయం అల్పాహారం తినకుండా టీ లేదా కాఫీ తాగేసి ఉండిపోతారు. ఒకేసారి భోజనం చేద్దామనుకుంటారు. ఉదయాన తిండి తినడం మానేస్తే సన్నబడతాం అని భావించేవాళ్లు కూడా అధికమే. కానీ బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఇంకా బరువు పెరుగుతారు కానీ తగ్గరు. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ చేయనివారు త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువుతో బాధపడేవాళ్లలో మధుమేహం ముప్పు అధికం. వీరు త్వరగా డయాబెటిస్ బారిన పడతారు. ఉదయాన అల్పాహారం తినడకపోవడం వల్ల లంచ్ లో అతిగా లాగిస్తారు. దీనివల్ల అరుగుదల సమస్య వస్తుంది. అంతేకాదు అతిగా తిన్న ఆహారం కొవ్వుగా పేరుకుపోతుంది. రక్తంలో గ్లూకోజు లెవెల్స్ కూడా అతిగా పెరిగిపోతాయి. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే తీపి తినాలన్న కోరిక పెరిగిపోతుంది. చాక్లెట్లు, స్వీట్ల కోసం వెంపర్లాడుతారు. వాటిని అధికంగా తినేస్తారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు.తద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే రోజంతా ఉత్సాహంగా గడుస్తుందో తెలుసుకుందాం. ఉదయం లేచిన రెండు మూడు గంటల్లోపే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొట్టలో వేయాలి. ఇలా తింటే రోజంతా ఉల్లాసంగా,శక్తివంతంగా ఉంటారు. ఉదయానే ఆహారం తినడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. దీనివల్ల మీరు బరువు తగ్గొచ్చు. ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, మాంసం, చేపలు, నట్స్ వంటివి భాగం చేసుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యకరమే. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. ఇక మధుమేహురోగులు ఆ రోగాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. వైట్ బ్రెడ్ తినేవాళ్లు అధికంగ ఉన్నారు. దాని బదులు మల్టీగ్రెయిన్స్ తో తయారుచేసిన బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిది. వాటిని జామ్, బట్టర్ కన్నా పీనట్ బటర్ తో తినడం మేలు. పప్పులతో వండుకునే గారెల్లాంటివి కూడా మంచివే. ఒకే పప్పు కాకుండా రెండు మూడు రకాల పప్పులు కలిపి చేసుకుంటే మరీ బలం. ఓట్స్, రాగి జావ లాంటివి ఇంకా బలన్నిస్తాయి. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. బయట ఇన్ స్టెంట్ బ్రేక్ ఫాస్ట్ లు దొరుకుతాయి. అలాగే నూడిల్స్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్ ఇలాంటివి కూడా అల్పాహారంలో తింటుంటారు చాలా మంది. ఇవన్నీ ప్రాసెస్ట్ ఫుడ్ కిందకి వస్తాయి. వీటిని తిన్నా సమస్యలే. మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉండదు. కాబట్టి ఇలాంటివి బ్రేక్ ఫాస్ట్‌లో తినడం మానాలి

Post a Comment

0Comments

Post a Comment (0)