బాలికపై మారుతండ్రి అత్యాచారం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్‌లో బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. మల్లంపేటలో ఓ జంట పదేళ్ళుగా సహజీవనం చేస్తోంది. ఆ మహిళ కుమార్తె (12)ను సైతం లోబర్చుకొని పదే పదే బాలికపై మారు తండ్రి రాకేష్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలియకూడదని. మల్లంపేట్ లోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకురాలి రిఫరెన్స్ తో నిజాంపేట్ లోని ఓ ఆర్ఎంపి వద్ద బాలిక కు అబార్షన్ చేయించాడు. బాలిక ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో బోల్లారంలో మరో ఆర్ఎంపి సంప్రదించాడు. అసలు విషయం తెలుసుకున్న ఆ ఆర్ఎంపి. బాలిక మారుతండ్రి రాకేష్ పై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బోల్లారం పోలీసుల సమాచారం తో దుండిగల్ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)