ఉత్తరప్రదేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యూపీలో బీజేపీ గెలుపునకు మరికొన్ని అంశాలు కూడా దోహదం చేశాయి. అయోధ్య రామాలయం, రైతు చట్టాల రద్దు, మోదీ-యోగీ-అమిత్‌షా వ్యూహాలు, యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్ వాది పార్టీ పై ముద్ర వేయడంలో సక్సెస్, యోగిపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అవినీతి ఆస్కారం ఉండే హోం, రెవెన్యూ, హౌసింగ్, మైన్స్ వంటి శాఖలను యోగి తన వద్దే ఉంచుకోవడం, నేరాలను అదుపు చేయడంతో మహిళల మద్దతు, కరోనా టైంలో ఉచిత రేషన్, విద్యార్థినులకు స్కూటర్లు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి అంశాలు కూడా బీజేపీ విజయం సాధించడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)