ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


తమిళనాడులోని వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీలో మంటలు అంటుకుని  ఆ తర్వాత పేలిపోయింది. కాగా, కొత్త ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిద్రపోతున్న తండ్రి, కూతురు ఎలక్ట్రిక్ బైక్‌ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో స్థానింగా విషాదం అలుముకుంది. ఓవర్ ఛార్జింగ్ కారణంగా బైక్ పేలిపోయినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వస్తువులు ఎంత సౌకర్యంగా పని చేస్తాయో వాటితో అంతే ప్రమాదం పొంచి ఉంటుందనేది మరోసారి రుజువైందని స్థానికులు అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)