దేశంలో 4,362 కరోనా కొత్త కేసుల నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.13 శాతమని, 98.68 శాతం మంది కోలుకున్నారని, 1.20 శాతం మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక 1,78,90,61,887 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో ఆదివారం ఒక్కరోజే 4,80,144 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.


Post a Comment

0Comments

Post a Comment (0)