నిన్న 8 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,614 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు 255గా ఉన్న మరణాలు తాజాగా 100 దిగువకు చేరాయి. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.15 లక్షల మంది మరణించారు. 4.24 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 5 వేల మందికి పైగా కొవిడ్ నుంచి బయటపడ్డారు. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,559కు చేరింది . మొత్తం కేసుల్లో ఆ వాటా 0.9 శాతం మాత్రమే. రికవరీ రేటు 98.71 శాతానికి చేరి ఊరటనిస్తోంది. ఇక నిన్న 18.18 లక్షల మంది టీకా తీసుకోగా.. 179 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో 3,614 కొత్త కేసులు నమోదు !
March 12, 2022
0