దేశంలో 3,116 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా మరణాలు భారీ సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తోంది. 7,61,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,116 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. అంతకుముందు రోజు 89 మరణాలు నమోదుకాగా.. ఆ సంఖ్య మరింత తగ్గి నిన్న 47కు చేరింది. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,15,850కి చేరింది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 5,559 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.71 శాతానికి మెరుగైంది. క్రియాశీల కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 38,069 (0.09%) యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 20,31,275 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 180 కోట్లు దాటిందని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)