మరోసారి నెంబర్ 1 ర్యాంకు ఏపీ సొంతం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వరుసగా రెండో ఏడాది 2021వ సంవత్సరానికి గాను  ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. పోలీసు/భద్రత, వ్యవసాయం, ఈ- గవర్నెన్స్, గ్రామీణాభివృద్ది అంశాలు జగన్ సర్కారును నెంబర్ 1గా నిలబెట్టినట్టు స్కాచ్ గ్రూపు రిపోర్ట్ కార్డు తెలిపింది. జిల్లా పాలనా యంత్రాంగం నిర్వహణ కూడా మెరుగ్గా ఉండడం ఉత్తమ ర్యాంకుకు తోడ్పడింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. రెండు పర్యాయాలు నెంబర్ 1 ర్యాంకును ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా సంపాదించుకోలేకపోయింది. రవాణా విషయంలోనూ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తర్వాత ఏపీ మూడో స్థానం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతి, ఫలితాలను విశ్లేషించిన అనంతరం స్కాచ్ గ్రూపు ఈ ర్యాంకులను కేటాయిస్తుంటుంది. స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు 2020లో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ సర్కారు 2021 రిపోర్ట్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఒడిశా సర్కారు ఎనిమిదో స్థానం నుంచి ఈ విడత మూడో స్థానానికి పుంజుకుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్రను స్టార్ ఫెర్ ఫార్మర్ గా.. తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను పెర్ ఫార్మర్ గా పనితీరు ఆధారంగా స్కాచ్ గ్రూపు వర్గీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)