13 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నిరసనల మధ్య ముగిసింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగ పత్రాలను చించివేసి, సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. మరోవైపు గవర్నర్ ప్రసంగం అనంతరం తొలి రోజు అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో 13 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 25 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దివంగత గౌతమ్‌ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9న సభకు సెలవు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)