ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ యువకుడు బంపర్ ఆఫర్లు కొట్టేశాడు. నెల వ్యవధిలోనే భారీ ప్యాకేజీలతో రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. గత నెలలో అమెజాన్ రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసింది. తాజాగా ప్రఖ్యాత గూగుల్ కంపెనీ రూ.47.5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన జయంతి విష్ణువ్యాస్ (23) ఈ ఘనత సాధించారు. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి గిరిజన సంక్షేమ వసతి గృహ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి వేదవల్లి గృహణి. పదో తరగతి వరకు నర్సీపట్నం, ఇంటర్ విశాఖపట్నంలో చదువుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్ ఎన్ఐటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రూ.8.5 లక్షల వార్షిక వేతనానికి యాక్సెంచర్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం అదే కంపెనీలో రూ.16 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నారు. గత నెలలో అమెజాన్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. అదే సమయంలో గూగుల్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో అద్భుత ప్రతిభ చూపి ఏడాదికి రూ.47.5 లక్షల జీతంతో ఉద్యోగం సాధించారు.
భారీ ప్యాకేజీలతో రెండు ఉద్యోగాలు !
February 04, 2022
0
Tags