ఢిల్లీలోని బురారీలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను చంపిన అనంతరం నిందితుడు అమన్సింగ్ బిస్త్ ఆ మృతదేహంపై అత్యాచారం చేసినట్లు తేల్చారు. అమన్ ను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. యువతితో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించిందని, అందుకే చంపేసి లైంగిక చర్యకు పాల్పడినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే మృతురాలు తన భార్య స్నేహితురాలేనని తెలిపాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 19న అమన్ భార్య కాశిక్ ఎన్క్లేవ్లోని తన ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె స్నేహితురాలు అర్ధనగ్నంగా పడి ఉండటాన్ని గమనించింది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమన్ భర్తను అనుమానితుడిగా భావించి, సోమవారం అరెస్టు చేశారు.
ప్రతిఘటించిందని దారుణంగా హత్య
February 23, 2022
0