బీహార్కు చెందిన గృహ నిర్మాణ కార్మికులు కాజీపేటలో నివాసం ఉంటూ ములుగు రోడ్డులో సెంట్రింగ్ పనిచేస్తున్నారు. పని ముగించుకుని మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు హంటర్రోడ్, ఉర్సు కరీమాబాద్ మీదుగా బొలెరో వాహనంలో 12 మంది కూలీలు కాజీపేటకు బయలుదేరారు. వాహనం అమ్మవారిపేట మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఎండీ.వాసీం (35), ఎండీ.అన్వర్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో 10 మంది కూలీలను సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నర్సింహారావు తన వాహనంతో పాటు ప్రైవేటు వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో కరీమాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై మడికొండకు వస్తున్న కడవెలుగు సుదర్శన్కు వాహనం తాకి తీవ్ర గాయమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు పేర్కొన్నారు.
వాహనం బోల్తాపడి ఇద్దరు కూలీల మృతి
February 23, 2022
0
Tags