ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

Telugu Lo Computer
0


విశాఖపట్నం రాంనగర్‌కు చెందిన వాసర్ల అనూష(22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మధురానగర్‌లోని జి-బ్లాక్‌లో ఒంటరి నివాసం ఉంటుంది. శనివారం డ్యూటీకి రాకపోవడంతో సహోద్యోగులు ఆమెకు ఫోన్ చేశారు. సాయంత్రం తన గదిలోకి వెళ్లి చూడగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూశారు. లోపల అనూష సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కనిపించింది. వెంటనే లోపలికి వెళ్లిన సహచరులు అనూషను కిందికి దించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె సహోద్యోగులు ఆమె సోదరుడు అవినాష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. విశాఖపట్నం నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీన్ అనే వ్యక్తిని మోసం చేశానని, అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని అనూష సూసైడ్ లెటర్ లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Post a Comment

0Comments

Post a Comment (0)