ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి కుటుంబ సభ్యులతో సహా సంక్రాంతి వేడుకల్లో భాగంగా నందమూరి బాలయ్య వెళ్లారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కారంచేడు కు చేరుకున్న బాలయ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు రోజులపాటు కారంచేడు లోనే బాలయ్య ఉంటారని తెలుస్తోంది. పండుగ అయ్యాక తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. నందమూరి బాలయ్య ఇటీవల నటించిన అఖండ సినిమా విజయం అందుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైన అఖండ సినిమా.. ఇప్పటికి కూడా థియేటర్లలో దుమ్ము లేపుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది అఖండ సినిమా. జై సినిమా జనవరి 21వ తేదీన హాట్ స్టార్ వేదికగా పోటీలో విడుదలకానుంది.
పురంధరేశ్వరి ఇంటికి బాలయ్య
January 14, 2022
0
Tags