రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


పండుగ రోజున కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దావణగెరెలో 50వ నంబర్​ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజూమున ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృత్యువాతపడ్డాడు. సమాచారం అందిన వెంటనే దావణగెరె ఎస్‌పీ సీబీ రిష్యంత్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతులను యాదగిర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)