కొడుకు మద్యం తాపించారని కేసు పెట్టిన మహిళ

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బెంగళూరు బసవేశ్వరనగర్‌లో తన మూడేళ్ల కొడుకు చేత తన భర్త, అత్తమామలు  మద్యం తాపించారని ఓ మహిళ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త, అత్తమామలతో కలిపి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. భర్త ఆమెను కట్నం కోసం వేధించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా 'ఆమె భర్త తన తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తన భర్త వివాహేతర సంబంధాన్ని బాధితురాలు ప్రశ్నిస్తే అతడి తమ్ముడికి పిల్లలు పుట్టడం లేదంటూ అత్త సంజాయిషీ ఇచ్చిందని బాధితురాలు పేర్కొంది. వాటితో పాటుగా తన భర్త, అతడి కుంటుంబీకులు తనను లైంగికంగా చాలా ఇబ్బంది పెట్టారని, ఈ విషయంలో తన భర్త వ్యతిరేకించకుండా వారికి వత్తాసు పలికేవాడని మహిళ చెప్పింది' అని పోలీసులు తెలిపారు. వీటన్నింటిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)