ఒక రాష్ట్రానికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌ పరిమితం!

Telugu Lo Computer
0


ఒక వ్యక్తి సొంత రాష్ట్రంలో ఎస్సీ గానీ ఎస్టీ గానీ అయి ఉంటే అక్కడే ఉద్యోగ, విద్య, భూ కేటాయింపుల రిజర్వేషన్‌కు అర్హుడని తేల్చి చెప్పింది. అదే వ్యక్తి వేరే రాష్ట్రానికి వలస వెళ్తే అక్కడ ఉద్యోగ, విద్య, భూ కేటాయింపులో రిజర్వేషన్‌ పొందేందుకు అర్హుడు కాదని తేల్చి చెప్పేసింది. జస్టిస్‌ ఎంఆర్ షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఒక్క వ్యక్తి ఎస్సీ ఎస్టీ అయితే తన సొంత రాష్ట్రంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయి. వేరే రాష్ట్రానికి వలస వెళ్లినప్పుడు ఏ రిజర్వేషన్లు వర్తించవు. పంజాబ్‌కు చెందిన ఎస్సీ వ్యక్తి రాజస్థాన్‌లో రిజర్వేషన్ కింద భూమి పొందడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. ఆయనకు కేటాయించిన స్థలాన్ని అసలు లబ్ధిదారుడికి ఇవ్వాలని సూచించింది. రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. రాజస్థాన్ టెనెన్సీ యాక్ట్‌ 1955ను ఉల్లంఘిస్తూ జరిగిన కేటాయింపును సరి చేసిన సుప్రీం కోర్టు భదర్ రామ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్ కొట్టేసింది. ''మహారాష్ట్ర, మరో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం జారీపై యాక్షన్ కమిటీ (1994)లో సుప్రీం కోర్టు తీర్పు ప్రస్తుత కేసులో పూర్తిగా వర్తిస్తుంది. ప్రతివాది పంజాబ్‌కు చెందిన ఎస్సీ. ఆ రాష్ట్రంలో ఆయన శాశ్వత నివాసి అయినందున, ఎస్సీ వ్యక్తికి చెందిన భూమిని కొనుగోలు చేయడం కోసం రాజస్థాన్‌లోని ఎస్సీ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు. రాజస్థాన్‌లో ఎస్సీ భూమిలేని ఎస్సీ వ్యక్తులకు అది గతంలో కేటాయించారు.'' అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆస్తి విక్రయానికి సంబంధించి అంగీకరించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)