హైదరాబాద్ బాలాపూర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ లో వృద్ధురాలైన ఆవుల విజయలక్ష్మి , కొడుకు రామకోటేశ్వరరావుతో కలిసి ఒక చిన్నఫ్లాట్ కొనుక్కొని ఉంటోంది. గతేడాది గుగులోతు దేవమ్మ అనే మహిళ వీరి ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఈ ఏడాది మే 25న రామకోటేశ్వరరావు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో విజయలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఫ్లాట్ను పని మనిషి దేవమ్మ సొంతం చేసుకోవాలనుకుంది. విజయలక్ష్మిని తరచూ వేధించి, చివరికి ఇంట్లో నుంచి తరిమేసింది. దీంతో బాధితురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. స్పందించిన జడ్జి శ్రీదేవి కేసు విచారించి, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బాధితురాలికి ఇంటిని తిరిగి అప్పగించింది.
ఇంటి యజమాని ని తరిమేసిన పనిమనిషి!
January 06, 2022
0
Tags