సంగీత దర్శకుడు తమన్‌ కు కరోనా పాజిటివ్‌ !

Telugu Lo Computer
0


టాలీవుడ్‌ పరిశ్రమను కరోనా మహమ్మారి కుదేపిస్తుంది. ఇప్పటికే ఈ కరోనా బారిన  చాలా మంది సినిమా స్టార్లు పడగా… తాజాగా సంగీత దర్శకుడు తమన్‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్‌ తెలిపాడు. తనకు గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు బయటపడ్డాయని దీంతో తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తమన్‌  వివరించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌ లో ఉన్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశాడు. కాగా.. టాలీవుడ్‌ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారీన పడ్డారు. మహేష్‌ బాబు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విశ్వక్‌ సేన్, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లాంటి నటులకు కరోనా సోకింది.

Post a Comment

0Comments

Post a Comment (0)