శ్రీకాకుళం జిల్లాలో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడపేటలో కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. అప్పన్న దాడిలో భార్య, అత్తమ్మ, సోదరి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)